బంజారాహిల్స్, సెప్టెంబర్ 16: రెండు నెలల క్రితం చనిపోయిన తన తండ్రిది గుండెపోటు కాదని, హత్య అని, ఆ హత్యను తన తల్లే చేసిందని పదకొండేళ్ల వారి కొ డుకు ఫిర్యాదు చేయడం తో పోలీసులు హత్యోదంతం మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు. రెండునెల ల క్రితం గుండెపోటుతో చనిపోయాడని భావించిన ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు ఆరోపణలు రావడంతో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిద్రపోతున్న తన తండ్రిని తల్లి చున్నీతో హత్య చేసిందంటూ.. పదకొండేళ్ల కొడుకు బంధువులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంచలనం సృష్టిస్తున్న ఘటనా వివరాలిలా ఉన్నాయి.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని మధురానగర్ వాసి జగదీష్(43)కు కాకినాడలోని గాంధీనగర్కు చెందిన శ్రీసుశ్రుతతో 2007లో పెళ్లయింది. వారికి రోహిత్ వెంకట సత్య(11) అనే కొడుకు ఉన్నాడు. కాగా, బతుకు దె రువు కోసం ఇటీవల నగరానికి వచ్చిన జగదీష్ దంపతులు ఫిలింనగర్లో అద్దెకు ఉండేవారు. సుశ్రుత సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తుండగా, జగదీష్ డ్రైవర్గా పనిచేసేవాడు. కాగా, జూలై 15న ఉదయం 6 గంటలకు కాకినాడలో ఉండే జగదీష్ తమ్ముడు రాజేష్కు ఫోన్ చేసిన సుశ్రుత జగదీష్కు గుండెపోటు రావడంతో చనిపోయాడని చెప్పింది. దాంతో మృతదేహాన్ని తీసుకుని కాకినాడకు రావాలని రాజేష్తో పాటు బంధువులు చెప్పడంతో అంబులెన్స్ మాట్లాడుకున్న సుశ్రుత అక్కడకు తీసుకువెళ్లింది.
మరుసటిరోజున జగదీష్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. అంత్యక్రియల అనంతరం, సు శ్రుత తన కొడుకును తీసుకుని గాంధీనగర్లోని పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, కొడుకును ఈ నెల 9న కాకినాడలోని పెదనాన్న ఇంట్లో వదిలిపెట్టిన సుశ్రుత ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చేసింది. కాగా, తల్లి వెళ్లిన తర్వా త కొడుకు రోహిత్ వెంకట్ సత్య పెద నాన్నతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, తండ్రి జగదీష్ను తల్లే చంపేసిందని బోరున విలపించాడు. జూలై 15న తెల్లవారుజామున 4.30 ప్రాంతంలో నిద్రపోతున్న తండ్రి మెడ కు చున్నీ బిగించి చంపిందని చెప్పాడు. తాను నిద్రపోతున్నట్లు నటించడం తో గుండెపోటు వచ్చిందని చెప్పిందని, ఇన్నాళ్లూ భయంతో ఈ విషయం ఎవరికీ చెప్పలేదని రోహిత్ చెప్పాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు పోలీసులు తిరిగి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సుశ్రుత ఆచూకీ కోసం గాలిస్తున్నారు.