బేగంపేట్ మే 1: బేగంపేట్ డివిజన్లోని పాటిగడ్డలో మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ నిర్మాణ పనులను ప్రారంభించడానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. దానిలో భాగంగా మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ నిర్మాణ స్థలంలో ఉన్న పాత భవనాలను బేగంపేట్ సర్కిల్ ఇంజినీరింగ్ అధికారులు శుక్రవారం కూల్చివేత పనులు ప్రారంభించారు. రూ.5 కోట్ల నిధులతో నిర్మించనున్న ఈ ఫంక్షన్హాల్ నిర్మాణానికి ఫిబ్రవరి నెలలో మంత్రి కేటీఆర్,తలసాని శ్రీనివాస్యాదవ్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ బేగంపేట్ డివిజన్ శ్రీనివాస్గౌడ్, సీనియర్ నాయకులు శ్రీహరి, వార్డు సభ్యులు నేరేళ్ల శేఖర్ ముదిరాజ్లు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఫంక్షన్హాల్ నిర్మాణానికి వారం రోజుల్లో పాత భవనాల కూల్చివేత పనులు పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం మలీపర్పస్ ఫంక్షన్హాల్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు బేగంపేట్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు తెలిపారు.