మారేడ్పల్లి, ఆగస్టు 14: సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తాలోని వివాహ భోజనంబు తెలుగు రెస్టారెంట్లో నోరూరించే వంటకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెస్టారెంట్తోపాటు ఫీస్ట్ లైక్ ఏ కింగ్ ఫుడ్ఫెస్ట్ను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి శనివారం ప్రారంభించారు. ప్రత్యేక మెనూతో వెరైటీ వంటకాలు భోజన ప్రియులను ఆకట్టుకోనున్నాయి. పలు రకాల శాఖాహారంతో పాటు మాంసాహారం వంటకాలు ఈ ఫెస్ట్లో అందుబాటులో ఉంచనున్నట్లు నిర్వాహకుడు రవిరాజు తెలిపారు.