చంపాపేట : చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయాన్ని సీనియర్ నటి అన్నపూర్ణ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహణ అధికారులు అమెను మేళ వాయిద్యాలతో ఆలయంలోకి సాధారంగా ఆహ్వానించి దైవ దర్శనానికి స్వాగతించారు. అనంతరం అమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులచే అమె అర్చనలు చేయించుకుని స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులతో ఆలయ ప్రతిష్ట గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ ధర్మకర్త చేగోని మల్లేశ్ గౌడ్, టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.