హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలిలో(Maulali) విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్ప దస్థితిలో(Suspicious circumstances )తల్లి, కుమారుడు మృతి చెందడం స్థానికంగ కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉరేసుకొని కుమారుడు ఆత్మహత్యకు పాల్పడగా ఆ పక్కనే తల్లి విగత జీవిగా పడి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.