హైదరాబాద్ నుంచి లడాక్ వరకు బైక్ రైడ్
ఎల్బీనగర్, జూలై 22 : మట్టిని, ప్రకృతిని కాపాడాలని, డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని, ప్రయాణాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు డ్రైవింగ్ చేసే వారు సీట్బెల్ట్ ధరించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ మోరల్ బైక్స్ క్లబ్ ఆధ్వర్యంలో నగరానికి చెందిన విష్ణువర్దన్, సాయి చరణ్, నరేశ్, మహ్మద్ షఫీయుద్దీన్, విక్రం లడాక్ వరకు బైక్ రైడ్ చేశారు. జూలై 1వ తేదీన నాంపల్లి నుంచి ప్రారంభమైన బైక్ రైడ్ ఈ నెల 24న తిరిగి నగరానికి చేరుకోనున్నది.