సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి 9గంటల వరకు అత్యధికంగా నగరలోని కాప్రాలో 3.75సెం.మీలు,మల్లాపూర్లో 3.73 సెం.మీలు, నేరెడ్మెట్లో 3.38 సెం.మీలు, ఉప్పల్ రాజీవ్నగర్లో 2.95 సెం.మీలు, మౌలాలిలో 2.63 సెం.మీలు, ఉస్మానియా యూనివర్సిటీలో 2.15 సెం.మీలు, మల్కాజిగిరి ఆనంద్బాగ్లో 1.98 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
రుతుపవనాలు మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 31.0, కనిష్ఠం 23.8 డిగ్రీలు, గాలిలో తేమ 70 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.