బడంగ్పేట, జనవరి7: ఆర్య వైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ స్వాగత్ గ్రాండ్లో బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నాళ్ల శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎమ్మెల్యే సబితారెడ్డిని ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్య వైశ్య సంఘాల నాయకులు కన్యకాపరమేశ్వరి దేవాలయం కోసం స్థలం కావాలని అడుగగానే ఇచ్చారని గుర్తుచేశారు. విద్యాలయాలం ఏర్పాటు కోసం స్థలం కేటాయించడానికి చొరవ తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, మాజీ ఎంపీపీ సిద్ధాల లావణ్య బీరప్ప, మిషన్ భగీరథ మాజీ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ గుప్త, ఆర్యవైశ్య సంఘం నాయకులు అమరవాది లక్ష్మీనారాయణ, లక్ష్మయ్య గుప్త వెంకటేశం గుప్త, తెరటి పల్లి శ్రీనివాస్ గుప్త, రమాదేవి, ప్రేమ్ కుమార్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
మీర్పేటలో అయ్యప్ప పడిపూజ…
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విశాల్ మార్టు దగ్గర ఏర్పాటు చేసిన అయ్యప్ప మహాపడి పూజకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. అనంతరం తుక్కుగూడలోని మంఖాల్ రోడ్డులో బచ్చపన్ స్కూల్ దగ్గర కేఎస్బీ మల్టీ స్పెషాలిటీ దవాఖానను ఆమె ప్రారంభించారు.