అత్తాపూర్, సెప్టెంబర్ 29: ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బుధవారం ఆయన రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అత్తాపూర్ పరిధిలోని భరత్నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు మురుగనీటి సమస్య తీవ్రంగా ఉందని ఔట్లేట్ సరిగా లేకపోవడంతో సమస్య ఎక్కువగా ఉందని తెలిపారు. రహదారిపై నీరు పారుతుండడంతో నడవలేకపోతున్నామని పేర్కొన్నారు. అత్తాపూర్ ప్రధాన రహదారి నుంచి కాలనీకి వచ్చే రహదారిపై ఇరువైపుల వాహనాల పార్కిం గ్, డబ్బాల ఏర్పాటుతో నిత్యం ఇబ్బందిగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మురుగునీటి సమస్యను పరిష్కరించాలని, అత్తాపూర్ రహదారిపై వాహనాల పార్కింగ్, డబ్బాల ఏర్పాటును అడ్డుకోవాలని టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్, ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రజా సమస్యలను అధికారులు తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అన్నారు.
అత్తాపూర్, భరత్నగర్, పాండురంగానగర్, నంది ముస్లాయిగూడ, హుడాకాలనీ, హైదర్గూడ ప్రాంతాల్లో త్వరలోనే అధికారులతో కలిసి పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తనకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ ఈఈ నాగేందర్, ట్రాపిక్ సీఐ లవకుమార్, అత్తాపూరర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి, సురేందర్రెడ్డి, అమరేందర్, సురేస్రెడ్డి, శంకర్, శ్రీధర్రెడ్డి, పీఎం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.