మణికొండ, జూలై 2 : అభివృద్ధితో పాటు ఆకుపచ్చని తెలంగాణను నిర్మించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ అనేక పథకాల ను ప్రవేశపెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. నాలుగవ విడుత పట్టణప్రగతి కార్యక్రమంలో భా గంగా శుక్రవారం నార్సింగి మున్సిపాలిటీ 14వ వార్డులో హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హా జరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏడేళ్లకాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. పచ్చదనం, పరిశుభ్రతతో నార్సింగి మున్సిపాలిటీ విరాజిల్లాలని కోరారు. పట్టణాల్లో సమీకృత మార్కెట్లను నిర్మించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖాయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్యాద వ్, మాజీ ఎంపీపీ మల్లేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు ఆర్. నర్సింహ, కౌన్సిలర్లు ఆదిత్యారెడ్డి, విజేతప్రశాంత్యాదవ్, సునీతగణేశ్, పత్తి శ్రీకాంత్, అమరేందర్రెడ్డి, పత్తి ప్రవీణ్కుమార్, లక్ష్మీప్రవళిక కిరణ్, కమీషనర్ సత్యబాబు, డీఈఈ నర్సింహరాజు, వేణుగోపాలస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ పొన్న రమేశ్, కో-ఆప్షన్ సభ్యులు ఫారూఖ్, మహమ్మద్, టీఆర్ఎస్ నాయకులు హరిశంకర్ పాల్గొన్నారు.
శంషాబాద్, జూలై 2 : శంషాబాద్ మున్సిపల్ ప రిధిలో రెండోరోజు పట్టణ ప్రగతి సంబురంగా నిర్వహించారు. శుక్రవారం ము న్సిపల్ చైర్పర్సన్ కొలన్ సు ష్మా మహేందర్రెడ్డి పర్యవేక్షణలో అన్ని వార్డుల్లో పట్టణప్రగతి కార్యక్రమాలను చేపట్టారు. 21వ వార్డులో కొవిడ్ టీకా వ్యాక్సినేషన్ను మున్సిపల్ చైర్పర్సన్ ప్రారంభించారు. సీఎస్కె కాలనీలో వైస్ చైర్మన్ గోపాల్, కౌన్సిలర్ రాజేందర్గౌడ్, బహద్దరి మక్తాలో కౌన్సిలర్ కుమార్, మేకల వెంకటేశ్తో పాటు పలువురు కౌన్సిలర్లు తమతమ వార్డు ల్లో పారిశుధ్యం, హరితహారం, కో వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
బండ్లగూడ, జూలై 2 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమాన్ని అధికారు లు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయడంలో తమవంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ మహేందర్గౌడ్, కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ చెత్త సేకరణ కార్యక్రమంలో భాగంగా చెత్తను సేకరించడంతో పాటు చెత్త డంపింగ్యార్డు స్థలంలో బ్లీచింగ్ పౌడర్ను చల్లారు. ఈ సందర్భంగా మేయర్ మహేందర్గౌడ్ మా ట్లాడుతూ పట్టణప్రగతిలో అన్ని బస్తీలతో పాటు రోడ్లను కూడా శుభ్రం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పట్టణ ప్రగతిలో అభివృద్ధే తమ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామా ల అభివృద్ధి కోసమే పట్టణప్రగతి కార్యక్రమం అన్నారు. పది రోజుల పాటు జరిగే కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని బస్తీల శుభ్రతతో పాటు పలు అంశాలపై అవగాహనను కల్పించాలన్నారు.