మైలార్దేవ్పల్లి, జూన్ 26 : నియోజకవర్గంలోని కార్మికులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. శనివారం మైలార్దేవ్పల్లిలోని తన నివాసంలో 26 ఏండ్ల క్రితం మూత పడిన కంపెనీలో పనిచేసిన 136 మంది ఉద్యోగులకు వేతన బకాయిలను యాజమాన్యంతో మాట్లాడి ఇప్పించారు.1995లో విండెల్ బ్రేవరీస్ లిక్కర్ కంపెనీ ముత పడింది. అప్పటి నుంచి కంపెనీ యాజమాన్యం తమకు వేతన బకాయిలను చెల్లించడం లేదని పలుమార్లు కంపెనీ ఉద్యోగులు ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ను కలిసి విన్నవించుకున్నారు.
ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని పలు దఫాలుగా కంపెనీ యాజమాన్యంతో చర్చించి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించేలా కృషి చేశారు. దీంతో ఉద్యోగులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ..పరిశ్రమలలో పని చేసే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్గౌడ్ , డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్ ,ప్రధాన కార్యదర్శి గుమ్మడి కుమార్, రాజేశ్ యాదవ్ మాధవరెడ్డి, రాముయాదవ్, సుధాకర్గౌడ్ పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్, జూన్ 26 : నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ తెలిపారు. శనివారం మండలంలోని నర్కూడ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నీరటి రాజు రెండు లక్షల 80 వేల తన సొంత నిధులతో నూతనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శంషాబాద్ ఏసీపీ భాస్కర్గౌడ్, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్విరాజు,సర్పంచ్ సునిగంటి సిద్ధులుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమన్నారు. గ్రామాలలో నేరలను నియంత్రించడం కోసం నిఘా నేత్రాలు ఎంతగానో సహకరిస్తాయన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ ప్రకాశ్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, ఎంపీటీసీ గౌతమి ,ఉప సర్పంచ్ గడ్డం శేఖర్యాదవ్,వార్డు సభ్యులు యాదగిరి, వినోద్కుమార్, మహేష్ ముదిరాజ్,కుమార్గౌడ్, నాయకులు యాదగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.