శంషాబాద్ రూరల్, ఆగస్టు 17 : గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, గ్రామ కమిటీలు, కార్యకర్తలు కీలకమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని చిన్నగోల్కొండ, మల్కారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ను కలిసి ఆయన చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, యాదగిరిరెడ్డి, నీరటి రాజు, శ్రీశైలం పాల్గొన్నారు.
చిన్నగోల్కొండ గ్రామ అధ్యక్షుడిగా సార జంగయ్యగౌడ్, ఉపాధ్యక్షులుగా యాదయ్య, కృష్ణగౌడ్, ప్రధాన కార్యదర్శిగా సాయిగౌడ్, కోశాధికారిగా కరుణాకర్రెడ్డి, పలువురు నాయకులతో కమిటీని ఎన్నుకున్నారు. మల్కారం గ్రామ అధ్యక్షుడిగా శ్రీనివాస్గౌడ్, ఉపాధ్యక్షులుగా కుమార్, వెంకటేశ్, ప్రధాన కార్యదర్శిగా అశోక్తో పాటు ఇతరులతో కమిటీని ఎన్నుకున్నామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి తెలిపారు.