శంషాబాద్ రూరల్, ఆగస్టు 11 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ చేరే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం శంషాబాద్ మండలంలోని హమిదుల్లానగర్, బహదూరుగూడ గ్రామాల్లో టీఆర్ఎస్ నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా కార్యకర్తలు గ్రామ స్థాయిలో కృషి చేయాలని సూచించారు.
హమిదుల్లానగర్ సర్పంచ్ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కే.చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్రావు, పీఏసీఎస్ చైర్మన్ దవాణాకర్గౌడ్,నీరటి రాజుముదిరాజ్, హమిదుల్లానగర్ సర్పంచ్ వట్టెల సతీష్యాదవ్, దేవరంపల్లి శ్రీనివాస్,బి కృష్ణ,పరమేష్, దేవేందర్గౌడ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని హమిదుల్లానగర్ టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గడ్డం అశోక్యాదవ్, ఉపాధ్యక్షుడు ఎన్ సాయి, ఏ మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్, కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్, కుమార్, శ్రీకాంత్, శ్రీనివాస్రెడ్డి, హజీమోదీన్ లను నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు హమిదుల్లానగర్ గ్రామ సర్పంచ్ సతీష్ యాదవ్ తెలిపారు.