చిక్కడపల్లి, డిసెంబర్10 : అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఆందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ హరినగర్లో రూ. 50 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్థానిక కార్పొరేటర్ రవిచారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు.
అన్ని డివిజన్లలో కోట్లాది రూపాయిలతో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి, నిర్ణీత కాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. పార్టీ నాయకులు ముఠా జయసిం హ, డివిజన్ అధ్యక్షుడు మోజస్, ప్రధాన కార్యదర్శి దామోదర్రెడ్డి, వెల్లంకి ఇంద్రసేనారెడ్డి, ఎర్రం శేఖర్, మధు, నీలాదే వి, తులసి, శోభ పాల్గొన్నారు.
అడిక్మెట్ డివిజన్లోని పద్మకాలనీలో రూ.8 లక్షల వ్యయంతో వీడీసీసీ రోడ్డు పనులు, జెడ్.బి గార్డన్ వద్ద నాలాకు రూ. 6 లక్షలతో చైన్ మెష్ ఏర్పాటు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డివిజన్ల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పార్టీ నాయకులు ముఠా జయసింహ, బల్ల శ్రీనివాస్రెడ్డి, సురేందర్, మనోహర్, కిశోర్, నేత శ్రీనివాస్, ఖదీర్, ప్రేమ్, మాధవ్ పాల్గొన్నారు.