కవాడిగూడ, ఆగస్టు 7 : రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వివిధ రకాల అత్యాధునిక వైద్య పరికరాలను అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మె ల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివా రం ముషీరాబాద్ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో రూ. 7 లక్షల విలువగల 5 ఆక్సిజన్ మిషిన్లు, పల్స్మీటర్లు, 10 బెడ్లు, బీపీ మిషిన్లు, మాస్కులు, శానిటైజర్లను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ద్వారా దవాఖాన వైద్యాధికారి డాక్టర్ కష్ణ మోహన్రావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్డీ సంస్థ ప్రతినిధులు శివరాణి, పార్వతి, డాక్టర్ కష్ణమోహన్రావు, పీహెచ్ఎన్ భాగ్యలక్ష్మి, నాయకులు ముఠా జయసింహ, భోలక్పూర్ అధ్యక్షుడు మహ్మద్అలీ, ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాస్రావు, శంకర్గౌడ్, సయ్య ద్ భక్తియార్, శివ ముదిరాజ్, అరవింద్యాదవ్, శివసింహ, నర్సింగ్, సురేశ్, శ్రావణ్కుమార్, కేఎం సాయి, విఘ్నేశ్ పాల్గొన్నారు.