దుండిగల్,జూన్12: కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శనివారం మంత్రి కేటీఆర్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న పనులను మంత్రి కేటీఆర్కు వివరించారు.
జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని రామ్రెడ్డి నగర్ నుంచి ఫాక్స్సాగర్ మీదుగా కొంపల్లి జాతీయ రహదారి(ఎన్హెచ్- 44) వరకు లింక్ రోడ్డు ఏర్పాటు, సుభాష్నగర్ (130) డివిజన్ పరిధిలోని సూరారంలోని లింగం చెరువును సుందరీకరించి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి , కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అపర్ణ ఫామ్గ్రోవ్స్ నుంచి దూలపల్లి రోడ్డు వరకు అండర్ గ్రౌండ్ ఆర్సీసీ పైపులైన్తో వర్షపు నీటి నాలా నిర్మాణానికి రూ.2.62 కోట్ల నిధుల కేటాయింపు, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మల్లంపేట్ గ్రామం వద్ద ఓఆర్ఆర్ 4,5 మధ్య ఎగ్జిట్, ఎంట్రీలు ఉండే విధంగా సదుపాయం, సుభాష్నగర్ పైపులైన్ రోడ్డులో ఉన్న కెమికల్ నాలా బ్రిడ్జిని ట్రాఫిక్ సమస్య లేకుండా వెడల్పు చేయడం వంటి పనులను చేపడుతున్నట్లు తెలిపారు.అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి అయ్యేలా ఆయా శాఖల అధికారులతో ఆదేశాలు జారీచేయాలని మంత్రిని కోరారు.
నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తనవంతుగా పూర్తి సహకారం అందజేస్తానని మంత్రి కేటీఆర్ తెలిపినట్లు ఎమ్మెల్యే వివేకానంద్,ఎమ్మెల్సీ శంభీపూర్రాజు పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరలోనే ఆయా విభాగాల అధికారులతో చర్చించి సకాలంలో పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకుంటానని,నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు పూర్తి సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తెలిపారు.