దుండిగల్, అక్టోబర్ 14 : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా ఉత్సవాలు జరుపుకుంటామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా హెచ్ఎంటీ పరిశ్రమ ఆవరణలో గురువారం నిర్వహించిన ‘ఆయుధపూజ’లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం యూనియన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రకాశ్గౌడ్, శ్రీశైలం, సత్యనారాయణ, ఆనందరావు, మహేందర్, చారి, శ్రీనివాస్నాయక్, గోపాల్కుమార్, రవీందర్, కృష్ణ ప్రసాద్, దానప్ప, లక్ష్మయ్య, టీజీకే సింగ్, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.