కుత్బుల్లాపూర్, డిసెంబర్17 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా ప్రజలంతా తనకు ఓటు వేసి గెలిపించారని, వారందరికీ రుణపడి ఉంటా నని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం జీడిమెట్ల(132) డివిజన్ గ్లోరీ టూ జీసస్ మినిస్ట్రీస్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ ఆంటోనీ, సంఘ పెద్దలు శ్యాంసుందర్, మడుపు ప్రశాంతి, పసల జోసెప్, డేవిడ్, యోనా, కుమార్, జోసెప్, చందు తదితరులు పాల్గొన్నారు.
దుండిగల్ : కులమత, ప్రాంతాలకు అతీతంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనను మూడోసారి గెలిపించిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో నిజాంపేట్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ ధన్రాజు యాదవ్, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.