గోల్నాక, జూన్ 18: ఎన్నో ఏండ్ల క్రితం మూసీ నదిపై ఏర్పాటు చేసిన వంతెనలు శిథిలావస్థకు చేరడంతో పాటు వానకాలంలో వరద నీటి ఉధృతితో అనేక సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలో నేటి అవసరాలకు అనుగుణంగా త్వరలోనే హైలెవల్ వంతెనల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం గోల్నాకలోని ఆయన క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ టౌన్ ప్లానర్ రంజిత్కుమార్తో పాటు ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అలీకేఫ్ చౌరస్తా నుంచి మూసారాంబాగ్, చాదర్ఘాట్ నుంచి మూసీ వంతెన వరకు నిర్మించనున్న హైలెవల్ వంతెనల నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. నిర్మాణాలకు సంబంధించిన ప్లానింగ్ మ్యాప్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కాచిగూడ, జూన్ 18: నియోజకవర్గంలోని పార్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని కృష్ణానగర్ పార్కు, బసంత్కాలనీ పార్కులను థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో అధికారులతో కలిసి శుక్రవారం రెండు పార్కులను సందర్శించి వాకర్లను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్కుల సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలోని పార్కులను అభివృద్ధి చేస్తానన్నారు.కార్యక్రమంలో ఎస్సీ అనిల్కుమార్, ఈఈ శంకర్, డీఈలు సుధాకర్, ఏఈలు ప్రేరణ, ఫరీద్, హార్టికల్చర్ డైరెక్టర్ రాజశేఖర్, మేనేజర్ సత్య, శ్రీధర్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఫిర్యాదుతో నియోజకవర్గంలోని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. స్థానిక సమస్యలపై టీఆర్ఎస్ నాయకుడు పట్లారి సతీశ్ ఫిర్యాదు మేరకు గోల్నాక డివిజన్లోని నింబోలిఅడ్డా తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించి, స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పలు డివిజన్లలో విద్యుత్ స్తంభాల చుట్టూ కంచె, బస్తీల్లో వీదిలైట్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గోల్నాక డివిజన్ అధ్యక్షుడు భరత్రాజ్ముదిరాజ్, అంజయ్యచారి, ప్రభాకర్ముదిరాజ్, వార్డు సభ్యురాలు ధనలక్ష్మి పాల్గొన్నారు.