చర్లపల్లి, నవంబర్ 8 : దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నా రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీనగర్, మహాలక్ష్మినగర్, కుషాయిగూడ, తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల డబుల్బెడ్ రూం ఇండ్లు నిర్మించి పంపిణీ చేశారని, గ్రేటర్లో లక్ష ఇండ్లు నిర్మాణం చేపట్టి 70వేల ఇండ్లు పంపిణీ చేశారని, గ్రేటర్గా అదనంగా మరో లక్ష ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారని, గ్రేటర్ పరిధిలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారన్నారు. అసరా పెన్షన్తో అర్హులైన వారికి చేయూతనందించేందుకు సీఎం కేసీఆర్ తగు చర్యలు తీసుకుంటున్నారని, నాలుగు వందలకే వం టగ్యాస్ సిలిండర్, రేషన్కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందించేందుకు చర్యలు తీసుకున్నారన్నా రు. రాష్ట్రంలో పేదరికం తగ్గించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, నాయకులు నాగిళ్ల బాల్రెడ్డి, నేమూరి మహేశ్గౌడ్, కనకరాజుగౌడ్, పండాల శివకుమార్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, జాండ్ల సత్తిరెడ్డి, బొడిగె రాజుగౌడ్, చెన్నయ్యగౌడ్, కడియాల బాబు, చల్లా వెంకటేశ్, సారా అనిల్, శ్రీకాంత్రెడ్డి, నరేశ్, లక్ష్మారెడ్డి, ఆనంద్రాజుగౌడ్, రెడ్డినాయక్, సురేశ్, సానెం రాజుగౌడ్, కొమ్ము రమేశ్, ఎంకిరాల నర్సింహా, వేణుగోపాల్రెడ్డి, కడియాల యాదగిరి, పల్లపు శ్రీనివాస్, రమేశ్, ము రళి, పాండు, సోమయ్య, ముత్యాలు, రవి, బాల్రాజు, పుష్పలత, నవనీత, సత్తెమ్మ, లలిత, రాధకృష్ణ, కాలనీవాసులు పాల్గొన్నారు.