కాప్రా/చర్లపల్లి , ఆగస్టు 28 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో పేదప్రజలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి డివిజన్లవారికి మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 102మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే బేతి, తాసీల్దార్ అనిత, కార్పొరేటర్లు స్వర్ణరాజు, బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ పావనీ మణిపాల్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడబిడ్డలను కన్న తల్లిదండ్రులకు సీఎం పెద్ద దిక్కుగా ఉన్నాడని, ఇంటికి పెద్దన్నగా ఉండి వారి వివాహాలకు రూ.లక్షా పదహారు వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను మహాయజ్ఞంలా కొనసాగిస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లోనే అన్ని కులాలవారికి సముచిత న్యాయం జరుగుతుం దని అన్నారు. కార్యక్రమంలో కాప్రా ఆర్ఐ శాలిని, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సుడుగు మహేందర్రెడ్డి, శివమణి, బాలరాజు, నేతలు సీతారాంరెడ్డి, కుమారస్వామి, బాలనరసింహా, రాజు, వీఆర్ఏ యాదయ్య పాల్గొన్నారు.