కాప్రా, ఆగస్టు 12: సీనియర్ సిటిజన్లు సమాజానికి మార్గదర్శకులని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, కమలానగర్లో రూ.17.5లక్షలతో నిర్మించిన వయో వృద్ధుల సంక్షేమ భవనాన్ని (సీనియర్ సిటిజన్స్ భవనం) గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో అపారమైన అనుభవాన్ని గడించిన వయో వృద్ధులు సమాజానికి ప్రయోజనం చేకూరేలా సేవా కార్యక్రమాలు చేపడుతూ, ప్రజాభిమాన్ని చూరగొనాలన్నారు. సంఘం భవన నిర్మాణానికి విరాళాలు అందజేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శిరీషా సోమశేఖర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పావనీ మణిపాల్రెడ్డి, కొత్తరామారావు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బేతాల బాలరాజు, పులిచేరాలు, కాసం మహిపాల్రెడ్డి, షేర్మణెమ్మ, మణిపాల్రెడ్డి, సురేందర్, రమేశ్చారి, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బి.ఎల్లారెడ్డి, విఠలాచారి, పార్థసారధి, బాల్రెడ్డి, సంగయ్య, పెద్ది నర్సింహ, రాఘవరెడ్డి, మోహన్రెడ్డి, సుదర్శన్రెడ్డి, వెంకట్రెడ్డి, గిరి, గోపి, తెలంగాణ పద్మ, సీతారాంరెడ్డి, సంఘం నేతలు, స్థానికులు పాల్గొన్నారు.