ఉప్పల్, ఆగస్టు 12 : ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గురువారం బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి.. బోనాలను అమ్మవారికి సమర్పించి.. మొక్కు లు చెల్లించుకున్నారు. ఉప్పల్ మహంకాళి అమ్మవారి బోనాలకు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి , చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్తో కలిసి హాజరై.. అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని అన్నా రు. ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తుందన్నారు. బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. కాలనీల్లో తోట్టెల ఊరేగింపు, ఫలహార బండ్ల ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం కాలనీవాసుల ఐక్యతను చాటు తుందన్నారు. పూజల్లో జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, చిలుకానగర్ డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, నేతలు పల్లె నర్సింగ్రావు, ఏదుల్ల కొండల్రెడ్డి, మాస శేఖర్, జగన్, అన్య వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
బోనాల సందర్భంగా ఉప్పల్లోని మహంకాళి, ఈదమ్మ ఆలయాల్లో గురువారం కార్పొరేటర్ మందుముళ్ల రజితాపరమేశ్వర్రెడ్డి పూజలు చేశారు. పూజల్లో కృష్ణ, మహంకాళి నర్సింహ, నర్సింగ్, గణేశ్, మురళీకృష్ణ, రఘు పాల్గొన్నారు.