మియాపూర్, జూలై 7 : శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్, కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో బుధవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో డీసీ ప్రశాంతి, కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, జూపల్లి సత్యనారాయణలతో కలసి ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరనగర్లో మొక్కలు నాటారు. ఆస్బెస్టాస్ కాలనీలో స్వయంగా విప్ గాంధీ శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. మనం మారితేనే నగరం మారుతుందని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా బాధ్యతగా వ్యవహరించి పరిసరాలను మరింతగా మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. చెత్తా చెదారం, వ్యర్థాలులేని కాలనీలను తీర్చిదిద్దుకోవాలని, ఇందుకోసం ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించుకోవాలన్నారు.
వర్షాకాలం నేపథ్యంలో ఎటువంటి అంటువ్యాధులూ ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ సిబ్బందికి సూచించారు. డ్రైనేజీలను, నాలాలను శుభ్రం చేసుకుని ముంపు సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, డీఈ శ్రీరాములు, ఏఈ శివప్రకాశ్, సుధాకర్, నాయక్, ఏఈ ఉషారాణి, నరేశ్, పార్టీ నేతలు రంగారావు, సంజీవరెడ్డి, లక్ష్మినారాయణ, భాస్కర్రావు, చంద్రకాంత్రావు, ఊట్ల చంద్రారెడ్డి, చంద్రమోహన్, హరినాథ్, ఆంజనేయులు, సత్యనారాయణ, నాగేశ్వర్రావు, శ్రీధర్రెడ్డి, కయ్యూమ్, ప్రసాద్, భాస్కర్రెడ్డి, శ్రావణిరెడ్డి, శివ, సాగర్, పద్మ, జ్యోతి, లావణ్య, లక్ష్మీదేవి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.