హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు కృష్ణం రాజు మృతిపట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో హీరోగా, నటుడిగా వివిధ పాత్రలలో తన విలక్షణ నటనాశైలితో ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్నారన్నారు.
కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా దేశ ప్రజలకు సేవలందించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.