హైదరాబాద్: వరల్డ్ రైల్వే ఆధ్వర్యంలో బల్గేరియాలో జరిగిన ప్రపంచస్థాయి టెన్నిస్ పోటీలలో తెలంగాణకు చెందిన యువకుడు పొన్నాల సిద్ధార్థ్ సత్తా చాటడం ఎంతో గర్వంగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మోండా మార్కెట్ డివిజన్ బండిమెట్కు చెందిన పొన్నాల సిద్ధార్థ్ గత నెల 18 నుంచి 24వ తేదీ వరకు బల్గేరియాలో వరల్డ్ రైల్వే ఆధ్వర్యంలో జరిగిన టెన్నిస్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్బంగా సిద్ధార్థ్ ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. సిద్ధార్థ్ వెంట మహేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.