హైదరాబాద్ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. అమీర్పేటోలని మున్సిపల్ గ్రౌండ్లో తలసాని యువసేన ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ జరుగనున్నది. పోటీల్లో సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ కాలేజీలకు చెందిన 80 జట్లు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. తలసాని యువసేన ఆధ్వర్యంలో 2014 నుంచి ఏటా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
రోజు రోజుకు క్రికెట్కు ఆదరణ పెరుగుతోందన్నారు. కీడ్రల్లో గెలుపు, ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. రోజులో కొంత సమయం క్రీడలకు కేటాయించడంతో మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యవంతమైన జీవనం లభిస్తుందన్నారు. ఇలాంటి పోటీలను వేదికలుగా చేసుకొని క్రీడాకారులు తమ సత్తా చాటాలన్నారు. అనేకమంది క్రీడా పోటీల్లో ప్రతిభను చాటి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదిగారని మంత్రి గుర్తుచేశారు.
పోటీల్లో విజేతలకు రూ.25వేలు, రూ.15వేల ప్రైజ్ మనీతో పాటు ఖరీదైన క్రికెట్ కిట్లను అందించనున్నట్లు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నిర్వాహకులు సచిన్, ముఖేష్, టీఆర్ఎస్ నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్రెడ్డి, వనం శ్రీనివాస్, బాసా లక్ష్మి, లలితా గోపిలాల్ తదితరులు పాల్గొన్నారు.