మహేశ్వరం,ఆగస్టు1 : పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజక వర్గానికి డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు కృషిచేసిన మంత్రిని మహేశ్వరం సీనియర్ నాయకులు చంద్రయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల చదువులకు ఎటువంటి ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ప్రజలకు మేలు జరిగే విధంగా డిగ్రీ కాలేజీలు మంజూరు చేశారని ఆమె అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలోనే డిగ్రీకాలేజీని ఏర్పాటు చేయాలని నాయకులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కూనయాదయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు ఆదిల్అలీ, మాజీ సర్పంచ్ ఆనందం, మాజీ ఉపసర్పంచ్ దోమశ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్లు దిద్దెల అశోక్కుమార్, పొల్కం బాలయ్య, కడమోని ప్రభాకర్, కోఆప్షన్ సభ్యులు జోరల రమేశ్, నవీన్, అంబయ్యయాదవ్, ఎంఏ సమీర్, రాములు, ఒగ్గుశ్రీశైలం, లింగం పాల్గొన్నారు.