గండిపేట జలాశయం వద్ద హెచ్ఎండీఏ కొత్తగా అభివృద్ధి చేసిన పార్కు పచ్చదనంతో ముస్తాబయింది. అత్యాధునిక నిర్మాణ శైలిలో ఏర్పాటు చేసిన ఎంట్రెన్స్ ప్లాజా, పూల తోటలు ఆహ్లాదకర వాతావరణానికి స్వాగతం పలుకుతున్నాయి. ప్రారంభానికి సిద్ధమైన ఈ గండిపేట పార్కును త్వరలోనే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ ట్వీట్ చేశారు.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ)