సికింద్రాబాద్, అక్టోబర్ 17: టైప్ ఇన్స్టిట్యూట్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర టైప్ రైటింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర టైప్ రైటింగ్ అసోసియేషన్ (టీఆర్టీఎస్) సమావేశం బోయిన్పల్లిలోని మర్రి రాజశేఖర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగింది. టీఆర్టీఎస్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బి.సతీశ్బాబు, రాజేశ్వర్, మల్లికార్జున్, రామేశ్వర్చారి, సీతారాం, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.