కవాడిగూడ, సెస్టెంబర్ 21 : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును మంచిర్యాల జిల్లాకు నామకరణం చేయాలని పలువురు వక్తలు అన్నారు. గురువారం బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్ ఆధ్వర్యంలో ట్యాంక్బండ్లోని జలదృశ్యం వద్ద గల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 11వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత సంగిశెట్టి శ్రీనివాస్ రచించిన బీపీ మండల్ పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ జగన్మోహన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, కిశోర్బాబు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, అరుణోదయ సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు విమలక్క, గల్ఫ్ తెలంగాణ ప్రవాస భారతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రుద్ర శంకర్ మాట్లాడారు.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను నెరవేర్చినప్పుడే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని ఈ సందర్భంగా వారు అన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు రోశం బాలు, అడ్వకేట్ జేఏసీ నాయకులు నాగుల శ్రీనివాస్ యాదవ్, మూర్తి పార్టీ నాయకుడు లక్ష్మణ్, దాసురామ్ నాయక్, ప్రొఫెసర్ వెంకట్ రాజం, లంబాడి హక్కుల వేదిక అధ్యక్షుడు డాక్టర్ రాజ్కుమార్, బీసీ రాజ్యాధికార సమితి నాయకులు దొంత ఆనందం, బోనం ఊర్మిల, మట్ట జయంతి, దుర్గేశ్, రాధాకృష్ణ బాయ్, అమ్మ బండారు పద్మావతి, వైద్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా నాంపల్లిలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం.ముజీబ్హుస్సేన్ తదితరులు
– సుల్తాన్బజార్, సెప్టెంబర్ 21