కేపీహెచ్బీ కాలనీ, జూన్ 25 : పట్టణ ప్రగతిని పకడ్బందీగా నిర్వహించేందుకు కార్యచరణ సిద్ధం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో ఐదు సర్కిళ్ల ఉప కమిషనర్లు, అధికారులతో జడ్సీ మమత పట్టణ ప్రగతి కార్యక్రమంపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుంచి 10వ తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
తెలంగాణకు హరితహారంలో ప్రజలందరినీ భాగస్తులను చేస్తూ భారీగా మొక్కలు నాటాలని ఆదేశించారు. హరితహారం లక్ష్యాన్ని సాధించేందుకు కార్యచరణ సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఉప కమిషనర్లు కె.రవికుమార్, వి.ప్రశాంతి, రవీందర్కుమార్, మంగతాయారు, నాగమణి, సీటీవో శంకర్ నాయక్, బయో అర్బన్ డైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీదేవి, ఏఎంహెచ్వో సంపత్కుమార్, చంద్రశేఖర్రెడ్డి, భానుప్రసాద్, నిర్మల, ప్రశాంతి, ఏఎంసీ శ్రీకాంత్రెడ్డి, మేనేజర్లు, ఎన్విరాల్మెంట్ ఇంజినీర్లు, ట్రాన్స్పోర్ట్ ఏఈలు పాల్గొన్నారు.