మల్కాజిగిరి, మార్చి 28: గత మల్కాజిగిరి ఎంపీ, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ఇక్కడి ప్రజలకు చేసిందేమీలేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విమర్శించారు. గురువారం మల్కాజిగిరి సర్కిల్ సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్పై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ శ్రీనగర్కాలనీలో పాదయాత్ర చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎంపీగా ఉన్న రేవంత్రెడ్డి మల్కాజిగిరి వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మల్కాజిగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయలను మంజూరు చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ప్రజలను కోరారు. మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, బద్దం పరశురాంరెడ్డి, మురుగేశ్, జేఏసీ వెంకన్న, రాము యాదవ్, రావుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.