హిమాయత్నగర్, సెప్టెంబర్ 30: రాష్ట్రంలోని దళితుల మధ్య చిచ్చుపెట్టేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రయత్నం చేయడం తగదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ అన్నారు. హైదర్గూడలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితబంధు వద్దు.. వర్గీకరణ కావాలని రేవంత్రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని, రాష్ట్ర సంక్షేమానికి ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా పాత్ర వహించకుండా సంక్షేమ పథకాలు వద్దని అనడం అవివేకమన్నారు. ఎస్సీ వర్గీకరణ యత్నాలకు వత్తాసు పలుకుతూ మాలల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ సమావేశంలో వాసు, తలారి అంజి, జ్యోతి, జ్ఞానేశ్వరి, చంద్రకళ పాల్గొన్నారు.