సిటీబ్యూరో, సెప్టెంబరు 1 (నమస్తే తెలంగాణ): యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ చీఫ్ సైంటిఫిక్ సలహాదారుతో పాటు ప్రతినిధుల బృందం శుక్రవారం టీ హబ్ను సందర్శించింది. ఈ బృందంలో యుకే ప్రభుత్వ చీఫ్ సైంటిఫిక్ సలహాదారు ప్రొఫెసర్ ఎంజిలా డేమ్ మ్యాక్లీన్తో పాటు పలువురు టీ హబ్లోని స్టార్టప్ కార్యకలాపాలను ప్రత్యేకంగా పరిశీలించారు.
అనంతరం రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ వారితోసమావేశమై పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్, మౌలిక వసతులు, మైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ వంటి కీలకమైన అంశాల్లో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపినట్లు టీ హబ్ ప్రతినిధి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా భాగస్వామ్యం కుదర్చుకునే ఆలోచన ఉందని యుకే ప్రతినిధుల బృందం పేర్కొంది.