చాంద్రాయణగుట్ట, ఆగస్టు 25 : జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ నర్కీపూల్బాగ్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో బుధవారం సమావేశమైయ్యారు. చార్మినార్ జోనల్ పరిధిలో నూటికి నూరుశాతం వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కలిసికట్టుగా ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ విజయలక్ష్మి, ఆరోగ్య,పారిశుధ్య అదనపు కమిషనర్ సంతోష్ కుమార్, జాయింట్ కమిషనర్ డి.డి.నాయక్, జోనల్ కమిషనర్ నామా సామ్రాట్ అశోక్, డిప్యూటీ కమిషనర్లు రజనీకాంత్రెడ్డి, అలిమేలు మంగతాయరు, రిచాగుప్త, సూర్యకుమార్, రాజేందర్రెడ్డి, జగన్, ఏఎంహెచ్వోలు డాక్టర్ పల్వాన్కుమార్, ఏవో బాల్రెడ్డి, సీసీ గుంటు గిరిబాబు పాల్గొన్నారు.
చార్మినార్, ఆగస్టు 25: ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ సమాజాన్ని కట్టడి చేసిన వైరస్ను తుద ముట్టించడానికి జీహెచ్ఎంసీ వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే రెండు మార్లు లాక్డౌన్తో ప్రజల మానసికస్థితిగతులతో పాటు ఆర్థికంగా కృంగదీసిన కరోనా వైరస్పై జీహెచ్ఎంసీ యుద్ధాన్ని ప్రకటించింది. గడువులోగా నిర్ణీత వయస్సును దాటిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు వేగంగా ముందుకు కదులుతున్నది. మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలతో పాటు స్థానిక ప్రాంతాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్న జీహెచ్ఎంసీ మరోమారు లాక్డౌన్తోపాటు ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు సమాయత్తమైనది.
చార్మినార్ జోన్లోని మలక్పేట్, రాజేంద్రనగర్, చార్మినార్, ఫలక్నుమా, సంతోష్నగర్, చాంద్రాయణగుట్ట సర్కిళ్ల వారీగా రోజు వారీగా వ్యాక్సిన్ మొబైల్ వాహనాలతోపాటు స్థానిక పీహెచ్సీ సెంటర్లలలో స్థానిక ప్రాంతాల్లోని ప్రజలకు కరోనా వైరస్పై పోరాటే వ్యాక్సినేషన్లను అందించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రోజు వారీగా ఒక్కో కేంద్రంలో 200 మందికి పైగా వ్యాక్సిన్లను అందించేందుకు అవరసమైన టీకాలు, ఇతర మౌలిక సదుపాయాలకు కొరత రాకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా వ్యాక్సిన్ల లభ్యతపై ఎప్పటికప్పుడు సమచారాన్ని సేకరిస్తూ ఎక్కడ అవాంతరాలు లేకుండా ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. మరో మారు కరోనా మూడో దశ తీవ్రంగా రాబోతుంన్న కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికి నిర్ణీత వ్యవధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. ఇంటింటి సర్వేతోపాటు మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలను ప్రజల వద్దకు తీసుకువస్తున్నారు. ప్రతి కాలనీలో వంద శాంతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.
మెహిదీపట్నం, ఆగస్టు 25 : వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసినట్లు సర్టిఫికెట్నుఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అందజేశారు. నాంపల్లి నియోజకవర్గం మెహిదీపట్నం డివిజన్లో బుధవారం వ్యాక్సిన్ కోసం ఇంటింటి సర్వేను నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మెట్టునట్రాజ్ వైద్యసిబ్బందితో కలిసి ప్రజలకు వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు.
చార్మినార్ జోన్లోని చార్మినార్, చాంద్రాయణణగుట్ట, మలక్పేట్, సంతోష్నగర్, మలక్పేట్, రాజేంద్రనగర్ సర్కిళ్ల పరిధిలో 903 కాలనీలను గుర్తించాం. ప్రతి సర్కిల్ పరిధిలో రమారమీగా జనసాంద్రత 2 లక్షల నుంచి 3 లక్షల వరకు గుర్తించాం. ఇందులో 28-30 శాంత వరకు 18 ఏండ్లునిండిన యువతీ యువకులు ఉన్నారు. వారితోపాటు ఇతరులకు సైతం వ్యాక్సిన్ అందించే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి రోజు సర్కిళ్ల వారీగా టీకాలను అందిచేందుకు అవరసమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు చేపడుతున్నాం. అశోక్ సామ్రాట్, జడ్సీ