వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 2 : చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.సుధీర్కుమార్ అన్నారు. అంతర్జాతీయ మిల్లెట్స్ ఇయర్ను పురస్కరించుకొని రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన బేకర్స్ న్యూట్రీహబ్ను వర్సిటీ రిజిస్ట్రార్ డా.సుధీర్కుమార్, పరిశోధన సంచాలకులు డా. జగదీశ్వర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం అవసరమన్నారు. అందుకనుగుణంగా వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనలతో పాటు, ప్రతి రైతుకు అవగాహన అవసరమని తెలిపారు. మిల్లెట్స్ ఉత్పత్తుల వ్యాపారానికి ఎంటర్ ప్రెన్యూర్స్ తమ అనుభవాలను తెలిపారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు జగదీశ్వర్,ఉన్నతాధికారులు డా.సీమ, డా. సత్యనారాయణ, డా.అనిత, డా.రవికుమార్, పాలెం ఏడీఆర్ డా.గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు బీసీ ఉద్యోగుల నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు.