వనస్థలిపురం, ఆగస్టు 22 : పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ వినాయక చవితిని జరుపుకుందామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం వనస్థలిపురంలో మట్టి గణపతి విగ్రహన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రశాంత్నగర్లో ఏర్పాటు చేసిన శెర్విన్ ఇన్ఫ్రా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్యం నుంచి నగరాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. మౌలిక వసతులు కల్పనలో మన నగరం అగ్రగామిగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇలాంటి నగరాన్ని కాలుష్యరహితంగా మార్చాలని సూచించారు. ప్లాస్టర్ఆఫ్ ప్యారీస్తో తయారు చేసిన విగ్రహాలు పర్యావరణానికి హాని చేస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో బీఎన్రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, వనస్థలిపురం కార్పొరేటర్ రావుల వెంకటేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, సంజయ్కుమార్, వేములయ్యగౌడ్, బావన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.