కేపీహెచ్బీ కాలనీ, మార్చి 31 : నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన కూకట్పల్లి వైజంక్షన్ సమీపంలోని మెట్రోట్రక్ పార్కు ఆవరణలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెగా జాబ్మేళా కొనసాగుతుందని తెలిపారు. ఈ జాబ్మేళాలో 100కు పైగా కంపెనీలు పాల్గొంటాయని, 10వేల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు.
పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిప్లొమా హోల్డర్స్, బీఫార్మా, ఎంఫార్మా, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంసీఎస్ వంటి అర్హతలు ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ జాబ్మేళాకు హాజరయ్యేవారు బయోడేటా, ఆధార్కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, ఎక్స్పీరియెన్స్ సర్టిఫికెట్, క్రీడల్లో ప్రావీణ్యత సర్టిఫికెట్ల జీరాక్స్లతోపాటు 4 పాస్పోర్టు సైజ్ ఫొటోలు వెంట తీసుకుని రావాలని సూచించారు. హాజరయ్యే వారికి తాగునీటి వసతితోపాటు అన్ని రకాల వసతులు కల్పించడంతోపాటు జాబ్మేళా నిర్వహణకు వలంటీర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలని కోరారు. మరిన్ని వివరాలకు.. 63017 17425, 63017 16125 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు.