చేర్యాల, జనవరి 1: భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం ఈనెల 7వ తేదీన (ఆదివారం) అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. దీంతో ఆలయవర్గాలు స్వామి కల్యాణ ఆహ్వాన పత్రికలను మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, దాతలు, అధికారులు, భక్తులకు అందజేస్తున్నారు. ఈ మహోత్సవాన్ని కనులారా చూసి తరలించాలని ఆలయ వర్గాలు కోరుతున్నాయి.
రెండు రోజుల పాటు పెండ్లి వేడుకలు
స్వామి వారి కల్యాణోత్సవ వేడుకలను ఆలయవర్గాలు రెండు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 7న ఉదయం 5గంటలకు స్వామి వారికి దృష్టికుంభం (బలిహరణం), 10-45గంటలకు స్వామికల్యాణం, అనంతరం ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 7గంటలకు రథోత్సవం (బండ్లు తిరుగుట). 8వ తేదీ సోమవారం ఉదయం 9గంటలకు స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన, అనంతరం మహామంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాదాల వితరణ, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వరుడు: మల్లికార్జున స్వామి
వధువులు: మేడలాదేవి, కేతమ్మ దేవీ
సుముహూర్తం: స్వస్తిశ్రీ శోభకృత్ నామ
సంవత్సరం మార్గశిర మాసం ఏకాదశి (07.01.2024 ఆదివారం), ఉదయం: 10-45 గంటలకు..
కల్యాణ వేదిక: కొమురవెల్లి పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో ఉన్న తోటబావి
కన్యాదాతలు: మహాదేవుని వంశస్తులు
స్వీకర్తలు: పడిగన్నగారి వంశస్తులు
వేద పర్యవేక్షణ: 1008 వీరశైవ పీఠాధిపతి మణికంఠ శివాచార్యుల ఆధ్వర్యంలో
పురోహితులు: నడిపుడి మఠం భవానయ్య స్వామి, భువనేశ్వరస్వామి, ఆనందయ్య, జ్ఞానేశ్వర్శాస్త్రి, చంద్రశేఖర్స్వామి,
భద్రయ్యస్వామి,
వ్యాఖ్యాతలు: డాక్టర్ మహంతయ్య, నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి స్వామిజీ
ముఖ్య అతిథులు: స్వామి వారి భక్తులు
ఆహ్వానితులు: ఆలయ కార్యనిర్వాహణాధికారి, వీరశైవ అర్చక, ఒగ్గు పూజారుల బృందం, ఆలయ సిబ్బంది.