సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : విద్యాపరమైన అంశాల్లో పరస్పర సహకారం కోసం జేఎన్టీయూహెచ్ ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీతో (ఎంవోయూ) ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు జేఎన్టీయూహెచ్ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహా రెడ్డి, సిడ్నీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గ్లోవర్లు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఎంటెక్, పీహెచ్డీ రీసెర్చ్ ప్రాజెక్టులు, కాన్ఫరెన్స్, సెమినార్, సిపోజియం, లెక్చరర్స్, పబ్లికేషన్స్లో పరస్పర సహకారం, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తదితర అంశాల్లో ఫ్యాకల్టీల పరస్పర సేవల వినియోగం ఉంటుందని ప్రొఫెసర్ నరసింహా రెడ్డి తెలిపారు.