సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): భర్తను చంపిన భార్యకు సహకరించిన మరో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి ఎనిమిదో అదనపు జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర ప్రసాద్ కథనం ప్రకారం.. బడంగ్పేటకు చెందిన బండి సురేశ్ శ్రీలత దంపతులు పిల్లలతో కలిసి ఏజీఆర్ కాలనీలో నివాసముండేవాడు. శ్రీలత పేరుపై ఉన్న ఇంటిని తన పేరుపై మార్చమని సురేశ్ వేధించేవాడు. భరించలేని శ్రీలత తన సోదరుడు లోకేశ్వర్తో పాటు ఇంటికి సమీపంలో ఉండే ధన్రాజ్, ఎల్. రాహుల్, నీలం శంకర్లతో కలిసి సురేశ్ను హత్య చేసింది. పోలీసులు నిందితులపై అభియోగ పత్రాలను దాఖలు చేయగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. ప్రధాన నిందితురాలు శ్రీలత, లోకేశ్వర్, ధన్రాజ్, శంకర్, రాహుల్కు జీవిత కారాగార శిక్ష, రూ. 10వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.