Hogar controls | సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ప్రముఖ అంతర్జాతీయ ఐఓటీ కంపెనీ హోగర్ కంట్రోల్స్కు డిజైన్, స్మార్ట్ హోమ్ సొలుష్యన్ ట్రేడ్ మార్క్ కేసులో ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. సంస్థ మాజీ డైరెక్టర్లు ట్రేడ్ మార్క్పై నమోదైన కేసుల్లో సంస్థకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డైరెక్టర్లకు ట్రేడ్ మార్క్పై ఎలాంటి హక్కులు లేవని పేర్కొంది. సంస్థకు అనుకూలంగా ఇంజెక్షన్ ఆర్డర్ రావడం హోగర్ కంట్రోల్స్ మొత్తానికి గొప్ప విజయమని సీఈవో విష్ణురెడ్డి విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
2022 అక్టోబర్లో వియత్నామీస్ కంపెనీ లూమీతో కలిసి మాజీ డైరెక్టర్లు సైబర్ దాడులకు పాల్పడ్డారు. అదేవిధంగా హోగర్ ట్రేడ్ మార్క్తో తప్పుదోవ పట్టించే కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో.. తాజా ఆదేశాలు వినియోగదారుల విశ్వసనీయతను పెంచుకునేందుకు మరింత దోహదపడుతుందన్నారు. కాగా సైబర్ దాడుల కేసులో మాజీ డైరెక్టర్లు విజయ్కుమార్ ఆనందాసు, కరుణ్కుమార్ ఆనందాసు, మరో నలుగురు వ్యక్తులు గతంలోనే అరెస్టయ్యారు.