ప్రస్తుతం ఉక్రెయిన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉక్రెయిన్ మొత్తాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. రష్యా సైనికులు.. ఉక్రెయిన్లో పేట్రేగిపోతున్నారు. ఉక్రెయిన్ను సర్వనాశనం చేస్తున్నారు. ఉక్రెయిన్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్న రష్యాపై ప్రపంచ దేశాలన్నీ విరుచుకుపడుతున్నాయి. వెంటనే యుద్ధం ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాయి. చివరకు రష్యా పౌరులు కూడా ఉక్రెయిన్కు మద్ధతు పలుకుతున్నారు.
యుద్ధం వల్ల ఉక్రెయిన్లో భారత పౌరులు వేల కొద్దీ చిక్కుకుపోయారు. ఎక్కువగా వైద్య విద్యార్థులే ఉక్రెయిన్లో చిక్కుకుపోవడంతో భారత ప్రభుత్వం వాళ్లను భారత్కు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఈనేపథ్యంలో ఉక్రెయిన్లో పెళ్లి చేసుకున్న ఓ జంట.. తాజాగా హైదరాబాద్లో రిసెప్షన్ నిర్వహించింది. వాళ్ల రిసెప్షన్కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉక్రెయిన్కు చెందిన ల్యూబోవ్ అనే యువతి.. భారత్కు చెందిన ప్రతీక్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ల పెళ్లి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కాకముందే ఉక్రెయిన్లో జరిగింది. అయితే.. తమ పెళ్లి రిసెప్షన్ను వాళ్లు ఇండియాలో జరుపుకోవాలనుకున్నారు. వెంటనే ఇండియాకు వచ్చేశారు. అప్పటికి ఇంకా యుద్ధం స్టార్ట్ కాకపోవడంతో వాళ్లు అక్కడి నుంచి భారత్కు చేరుకోగలిగారు.
ఇటీవల.. ఆ జంట రిసెప్షన్ హైదరాబాద్లో జరిగింది. వాళ్ల రిసెప్షన్కు పూజారిగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ విచ్చేసి వాళ్లను ఆశీర్వదించారు.