శిల్పారామానికి సందర్శకులు అధిక సంఖ్యలో విచ్చేశారు. శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ప్రదర్శనల్లో భాగంగా ఆదివారం సాయంత్రం కూచిపూడి నృత్యరూపకాలు ఆధ్యాంతం ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రదర్శింపబడిన భరతనాట్య నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మేళాలో వివిధ రాష్ర్టాలకు చెందిన చేనేత, హస్తకళాకారుల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నట్లు నిర్వహకులు తెలిపారు.
– కొండాపూర్, జనవరి 1