వెంగళరావునగర్, మే 24: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు.. బంజారాహిల్స్కు చెందిన కొర్ర మహేశ్ అలియాస్ లక్కీ (21), మోతీనగర్కు చెందిన నునావత్ సుధాకర్ (21) కలిసి అమీర్పేటలోని నేచర్ క్యూర్ దవాఖాన వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టి సోమవారం రాత్రి పట్టుకున్నారు.
వారి వద్ద ఉన్న ద్విచక్రవాహనంలో ఒక కిలో 200 గ్రాముల గంజాయి దొరికింది. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించనున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.