కరాచీ, జూలై 17: భారత్కు చెందిన ఇండిగో విమానాన్ని ఆదివారం అత్యవసరంగా పాకిస్తాన్లోని కరాచీలో ల్యాండ్ చేశారు. యూఏఈలోని షార్జా నగరం నుంచి హైదరాబాద్కు రావాల్సిన 6ఈ-1406 విమానంలో మార్గమధ్యంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాటిని గుర్తించిన పైలెట్ అత్యవసరంగా కరాచీలో దించారు. ప్రస్తుతం అక్కడే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులను తరలించడానికి మరో విమానాన్ని కరాచీకి పంపినట్టు ఇండిగో విమానయాన సంస్థ తెలిపింది. భారత్కు చెందిన ఓ విమానం పాక్లో అత్యవసరంగా ల్యాండ్ కావడం వారంలో ఇది రెండో ఘటన. ఇటీవల దేశీయ విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటం ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తున్నది.