హయత్నగర్, ఏప్రిల్ 29: ముంబై వెస్ట్రన్ నేవల్ కమాండ్ లో జరిగే షిప్ అటాచ్మెంట్ క్యాంపునకు హయత్నగర్ ప్ర భుత్వ డిగ్రీ కళాశాల బీకాం రెండో సంవత్సరం చదువుతు న్న ఎన్సీసీ క్యాడెట్స్ అద్దంకి రవి తేజ, సాయికృష్ణ ఎంపికయ్యారని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపులో క్యాడెట్స్ నేవల్ వార్ షిప్, సబ్మెరైన్, నేవల్ ఎస్టాబ్లిష్మెంట్లో మే 2 నుంచి 13 వరకు 12 రోజుల పాటు శిక్షణ పొందుతారని కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ సబ్ లెఫ్టినెంట్ డాక్టర్ ధన్రాజ్ తెలిపారు. కళాశాల అధ్యాపకులు, కో క్యాడెట్స్ విద్యార్థులు ఎంపికైన క్యాడెట్స్కి అభినందనలు తెలిపారు.