మల్కాజిగిరి, డిసెంబర్ 9 : బస్తీల్లో పేదల అవసరాల కోసం కమ్యూనిటీహాళ్లను నిర్మిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ తరుమలనగర్లో రూ.15 లక్షలతో కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ ప్రేమ్కుమార్తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు నివసిస్తున్న బస్తీల్లో జరిగే శుభ కార్యాలకు కమ్యూనిటీహాళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. శుభకార్యాలకు రోడ్లపైన టెంట్లు వేసుకుని ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రైవేటు ఫంక్షన్ హాళ్లకు కిరాయి కట్టలేక అప్పుల పాలవుతునట్లు గుర్తించామన్నారు. బస్తీల్లో నివసిస్తున్న పేదలకు కమ్యూనిటీ హాల్లో శుభకార్యాలతోపాటు మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. అధికారులతో బస్తీల్లో సర్వే చేయించి కమ్యూనిటీహాల్ల కోసం స్థలాన్ని ఎంపిక చేస్తామన్నారు. అభివృద్ధి పనులకు ఆర్థిక ఇబ్బందులు లేవన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్కుమార్, డీఈ లౌక్య, ఏఈ శ్రీకాంత్, సంతోశ్రాందాస్, సత్తయ్య, భాగ్యనందరావు, విజయకుమార్, సత్యమూర్తి, ప్రసాద్, బాబు, కవిత, ఉమాపతిరావు, బ్రహ్మయ్య, ఇబ్రహీం, నర్సింగరావు, ఉమారెడ్డి, ముత్యాలు, బాబురావు, రంగయ్య, సత్యప్రకాశ్, ముక్తర్, అనిల్కుమార్ తదితరులు
పాల్గొన్నారు.