అంబర్పేట, నవంబర్ 22 : అంబర్పేట నియోజకవర్గంలో ప్రత్యేక ప్రణాళికతో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం బాగ్అంబర్పేట డివిజన్ కుమ్మరివాడి బస్తీలో రూ.8.70 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైపులైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట తదితర డివిజన్ల పరిధిలోని పలు బస్తీలు, కాలనీల్లో ఇప్పటికే నూతన డ్రైనేజీ వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో సుమారు రూ.20 కోట్ల వ్యయంతో కొత్త డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ ఏర్పాటు చేశామని చెప్పారు. అనంతరం కుమ్మరివాడి బస్తీలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ పనులు పూర్తి కాగానే రోడ్డు నిర్మాణం చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, సీనియర్ నాయకులు శ్రీరాములు ముదిరాజ్, మిర్యాల రవీందర్, పంజాల చంద్రశేఖర్గౌడ్, డి.లక్ష్మణ్, కనివేట నర్సింగ్రావు, శివాజీ యాదవ్, నవీన్యాదవ్, బీజేపీ నాయకులు చుక్క జగన్, సి.కృష్ణ గౌడ్, అజయ్కుమార్, ఎం.శ్రీనివాస్, శివ, తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ముస్లిం మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం అంబర్పేట మండల తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ సీహెచ్ లలిత, కార్పొరేటర్లు విజయ్కుమార్గౌడ్, బి.పద్మావెంకట్రెడ్డి, వై.అమృత తదితరులతో కలిసి 33 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.33లక్షల 4వేల విలువగల షాదీముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. ఆడబిడ్టలకు అండగా ఉంటూ వారి పెండ్లిళ్లకు అక్షరాల లక్షా నూట పదహారు రూపాయలు అందించి వారి కుటుంబంలో సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా మారాడన్నారు. ఆడపిల్ల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు అమలు చేస్తోందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి బీవీ మహేశ్రాజుతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.